Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hyderabad: రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన స్వరూప

సెల్వి
మంగళవారం, 17 జూన్ 2025 (22:17 IST)
Swaroopa
ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతికి ఈ ఘటన అద్దం పడుతోంది. జీహెచ్‌ఎంసీలోని కాప్రా సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఇంజినీర్ స్వరూప.. రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని కాప్రా సర్కిల్, చర్లపల్లి డివిజన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ స్వరూప లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నగరానికి చెందిన ఒక కాంట్రాక్టర్, తాను చేసిన పనులకు సంబంధించిన బిల్లులను చెల్లించాలని ఏఈ స్వరూపను పలుమార్లు ఆశ్రయించారు. 
 
అయితే.. కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడానికి బదులుగా.. ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచంగా ఇవ్వాలని తీవ్రంగా ఒత్తిడి చేసింది. అయితే ఆ కాంట్రాక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేసాడు.

ఏసీబీ అధికారుల పర్యవేక్షణలో.. బాధితుడైన కాంట్రాక్టర్ నుంచి ఏఈ స్వరూప రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ బృందం ఆమెను తక్షణమే పట్టుకుంది. లంచంగా తీసుకున్న నగదును స్వాధీనం చేసుకుని.. ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకుని లోతుగా విచారణ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments