Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో సైబర్ మోసగాళ్లు.. రూ.10.61 కోట్లు కోల్పోయిన వృద్ధ జంట

సెల్వి
శుక్రవారం, 4 అక్టోబరు 2024 (18:21 IST)
సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌లో ఎక్కువైపోతున్నారు. నగరానికి చెందిన ఓ వృద్ధ జంటను రూ.10.61 కోట్ల మేర మోసం చేశారు. వివరాల్లోకి వెళితే.. మోసగాళ్లు వృద్ధుడిని వాట్సాప్ ద్వారా సంప్రదించారని, అతని పేరు మీద ముంబైలో బ్యాంక్ ఖాతా తెరిచినట్లు చెప్పారు. 
 
ఇక, జూలై 8న మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంటూ, నకిలీ మెసేజ్ లు పంపడంతో పాటు ఆ జంటను భయపెట్టే వ్యూహాలను ఉపయోగించారు. ఇక ఆ మనీలాండరింగ్ కేసు నుండి అతని పేరును క్లియర్ చేయడానికి వారి ఆదేశాలను అనుసరించమని స్కామర్లు బాధితుడికి సూచించారు. 
 
ఇక భయంతో వణికిపోయిన ఆ జంట స్కామర్ల వలలో చిక్కుకున్నారు. నేరంతో సంబంధం లేదని తేలితే మూడు రోజుల్లో నిధులు తిరిగి వస్తాయని పేర్కొంటూ మోసగాళ్ల ఖాతాలకు బదిలీ చేయమని వారు ఒప్పించారు. 
 
ఈ క్రమంలో ఆ వృద్ధ జంటను జులై 8 నుంచి 26వ తేదీ వరకు 11 వాయిదాల్లో మొత్తం రూ.10.61 కోట్లను మోసం చేశారు. ఆపై మోసపోయామని తెలుసుకున్న ఆ జంట సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తర్వాతి కథనం
Show comments