Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖమ్మంలో 1612 కిలోల గంజాయి అగ్నికి ఆహుతి

ganja

సెల్వి

, శుక్రవారం, 4 అక్టోబరు 2024 (17:01 IST)
ఖమ్మం జిల్లాలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ శుక్రవారం రూ.4 కోట్ల విలువైన 1612 కిలోల గంజాయిని దగ్ధం చేసింది. ఖమ్మం జిల్లాలోని నాలుగు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్లలో స్మగ్లర్లపై సదరు శాఖ చేపట్టిన తనిఖీల్లో అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్నారు. 
 
డిపార్ట్‌మెంట్ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్, వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన తర్వాత ఎక్సైజ్ అధికారులు బ్యాగుల్లో నింపిన నిషిద్ధ వస్తువులను జిల్లాలోని ఐఎన్‌టీసీ కాంప్లెక్స్‌కు తీసుకొచ్చి దహనం చేశారు.
 
కాగా చాలా కాలంగా వివిధ కేసుల్లో పట్టుబడిన పెద్ద మొత్తంలో గంజాయిని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ నేతృత్వంలో సోమవారం శాస్త్రీయ పద్ధతిలో దహనం చేయడం తొలిసారి కావడం గమనార్హం.
 
ఈ గంజాయి మండుతున్నప్పుడు వెలువడే వాయువులు కూడా మానవాళికి హానికరమే కావడంతో నగర శివారు మంచుకొండ ప్రాంతానికి తీసుకెళ్లి పంచనామా అనంతరం తగులబెట్టారు. ఖమ్మం వన్ టౌన్, ఖమ్మం టూ టౌన్, ఖమ్మం త్రీ టౌన్, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, వేంసూరు, కల్లూరు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన 7 కేసుల్లో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జరిపిన నేరస్థులను అరెస్టు చేసినట్లు అడిషనల్ డిసీపీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలా గెలిచి ఇలా మారిపోతే ఎలా పవన్ గారు: వైఎస్ షర్మిల సెటైర్లు