Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖానాపూర్‌లో నడిరోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపేశారు...

ఠాగూర్
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (15:58 IST)
తెలంగాణా రాష్ట్రంలో దారుణం జరిగింది. నిర్మల్ జిల్లాలో నడి రోడ్డుపై యువతిని కత్తితో నరికి చంపేశారు. ఈ దారుణానికి పాల్పడిన ఓ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దారుణం జిల్లాలని ఖానాపూర్ పరిధి శివాజీ నగర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు. ఖానాపూర్‌ పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన సీహెచ్ సోనీ అలియాస్‌ స్వీటీ (20).. టైలరింగ్‌ షాపు నుంచి ఇంటికి వెళ్తుండగా యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఆమె వదిన, పక్కనే ఉన్న రెండేళ్ల చిన్నారిపైనా దాడికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనలో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బాలుడి తలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ మోహన్‌, ఎస్‌ఐ లింబాద్రి పరిశీలించారు. యువతిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన తర్వాత పరారైన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments