Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. ఐదుగురు జలసమాధి (Video)

ఠాగూర్
శనివారం, 7 డిశెంబరు 2024 (08:22 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు చెరువులో మునిగిపోవడంతో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 
 
తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లా, పోచంపల్లి జలాల్ పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంతో వెళుతున్న కారు నియంత్రణ కోల్పోయి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారు చెరువులోని నీటిలో మునిగిపోయింది. దీంతో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు జలసమాధి అయ్యారు. ఒకరు మాత్రం చెరువు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను వెలికి తీసి, భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి పోచంపల్లికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను హైదరాబాద్‌కు చెందిన వినయ్, హర్ష, బాలు, దినేశ్, వంశీలుగా గుర్తించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments