Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు చెల్లించలేక విద్యుత్ తీగలను పట్టుకుని రైతు ఆత్మహత్య (Video)

వరుణ్
మంగళవారం, 23 జులై 2024 (10:05 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ట్రాన్స్‌‍ఫార్మర్ వద్ద ఉన్న విద్యుత్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా, కుభీర్ మండలం సిర్సెల్లి గ్రామానికి చెందిన జాదవ్ మారుతి(45) తన భూమిని సాగు చేసుకుంటూ, ఆటో నడుపుతున్నాడు. రెండేళ్ల క్రితం కుమార్తె వివాహం, ఇంటి నిర్మాణం కోసం రూ.25 లక్షల వరకు అప్పు చేశాడు. 
 
అయితే, తనకున్న ఐదున్నరెకరాల్లో ఎకరంన్నర భూమి అమ్మగా వచ్చిన రూ.12 లక్షలతో కొంత అప్పు తీర్చాడు. రూ.13 లక్షల అప్పు తీర్చడానికి మిగిలిన నాలుగెకరాలు అమ్మితే కొడుకుకు భూమి ఎలా అని మదనపడిన మారుతి.. సోమవారం పల్సితండాకు వెళ్తున్నానని ఇంట్లో భార్యకు చెప్పి ఆటోతీసుకుని వెళ్లాడు. పల్సితండా సమీపంలో రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ టాన్స్‌ఫార్మర్ తీగలను పట్టుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments