Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూషాయిగూడ పారిశ్రామికవాడలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చెత్త కుప్పలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. చెత్త ఎత్తుతుండగా ఈ పేలుడు సంభవించింది. రోడ్డు పక్కనే చోటుచేసుకున్న ఈ ఘటనతో పాదాచారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పేలుడుకు కారణం రసాయన పదార్థాలని గుర్తించారు. 
 
అయితే, ఈ కెమికల్స్ అక్కడకు ఎలా వచ్చాయి. ఎవరు వేశారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఘటనా స్థలానికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments