కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

ఠాగూర్
ఆదివారం, 23 మార్చి 2025 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కూషాయిగూడ పారిశ్రామికవాడలో ఓ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. చెత్త కుప్పలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. చెత్త ఎత్తుతుండగా ఈ పేలుడు సంభవించింది. రోడ్డు పక్కనే చోటుచేసుకున్న ఈ ఘటనతో పాదాచారులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
 
స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో పేలుడుకు కారణం రసాయన పదార్థాలని గుర్తించారు. 
 
అయితే, ఈ కెమికల్స్ అక్కడకు ఎలా వచ్చాయి. ఎవరు వేశారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, ఘటనా స్థలానికి సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments