Webdunia - Bharat's app for daily news and videos

Install App

కవిత అరెస్టు.. ఈడీపై కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు.. బంజారాహిల్స్‌లో కేసు నమోదు

సెల్వి
శనివారం, 16 మార్చి 2024 (23:18 IST)
KTR
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కవిత అరెస్టు సందర్భంగా తమ విధులకు ఆటంకం కలిగించారని ఆరోపించారు. ఈ మేరకు ఈడీ అధికారిణి ప్రియా మీనా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కవిత అరెస్ట్ సమయంలో కేటీఆర్ ఈడీ అధికారులకు పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఆమెను అరెస్టు చేయబోమని గతంలో సుప్రీంకోర్టుకు తెలియజేసినా ఎందుకు అరెస్టుకు దిగుతున్నారని ఆయన ప్రశ్నించారు.
 
శని, ఆదివారాల్లో కోర్టులు మూతపడతాయని తెలిసినా శుక్రవారమే అరెస్టు చేయాలని నిర్ణయించుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలకు సంబంధించిన వీడియోలు మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి.

సంబంధిత వార్తలు

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments