Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదలతో బాధపడుతున్న ఆంధ్ర ప్రజలను ఆదుకోవాలని మీకు లేదా? ఆంధ్రకు ఆమ్రపాలి?

ఐవీఆర్
మంగళవారం, 15 అక్టోబరు 2024 (18:55 IST)
కర్టెసి-ట్విట్టర్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లం మొర్రో అంటున్నారు ఆ ఐఏఎస్ అధికారులు. ఈ నెల 9వ తేదీన కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి తాము తెలంగాణ రాష్ట్రంలోనే వుండేట్లు చూడాలంటూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, రోనాల్డ్ రాస్, సృజనలు కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్(క్యాట్) ను ఆశ్రయించారు. ఐతే వారి పిటీషన్లు విచారించిన క్యాట్ వారి ముందు ఆలోచింపజేసే వ్యాఖ్యలను చేసింది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు వరుస వర్షాలతో వరదలు వచ్చి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అలాంటి ప్రాంతాలకు వెళ్లి వారికి తగిన సేవ చేయాలని మీకు లేదా అంటూ ప్రశ్నించింది. ఐఏఎస్ ల కేటాయింపులపై డీవోపీటికి పూర్తి అధికారాలు వున్నాయనీ, స్థానికత అనే అంశం వున్నప్పటికీ స్వాపింగ్ చేసుకునే అవకాశం నిబంధనలలో వున్నాయా అంటూ ప్రశ్నించింది.
 
కేంద్రం ఆదేశించినట్లుగానే జాబితాలో వున్న ఐఏఎస్ అధికారులు అందరూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. దీనితో పలువురు అధికారులు ఇప్పటికే ఏపీకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాలలో సైతం సేవలు అందించారు. ఈ నేపధ్యంలో ఆమె ఏపికి వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments