Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ అధికారులను అడుక్కోవడం ఏంటి? వాళ్లకు టీటీడీ వుంటే మనకు వైటీడీ ఉంది కదా? సీఎం రేవంత్

ఠాగూర్
శుక్రవారం, 21 మార్చి 2025 (09:00 IST)
తిరుమల శ్రీవారి దర్శనాలకు ఏపీ అధికారులను అడుక్కోవడం ఏమిటని తమ రాష్ట్ర ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉందన్నారు. తిరుమలకు వెళ్లే బదులు మన రాష్ట్రంలోని ఆలయాలను సందర్శించాలని ఆయన సూచించారు. 
 
తిరుమల దర్శనాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతిసారీ ఏపీ ప్రభుత్వాన్ని, తితిదే అధికారులను అడుక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. వారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే మనకు యాదగిరి గుట్ట దేవస్థానం ఉందని అన్నారు. భద్రాచలంలో రాముడు మనకు లేడా? మనకేమైనా శివాలయాలు తక్కువ ఉన్నాయా? అని ప్రశ్నించారు. 
 
తిరుమల వెళ్లి బతిమాలుకునే బదులు తెలంగాణాలో ఉన్న ఆలయాలకు వెళ్లొచ్చని అన్నారు. తెలంగాణకు అద్భుతమైన సాంస్కృతిక వారసత్వం ఉందని, మన ప్రాంతాలను మనం అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. సిలికాన్ వ్యాలీనే ఇపుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మెక్ డొనాల్డ్ కంపెనీ నిన్ననే మన రాష్ట్రానికి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments