Webdunia - Bharat's app for daily news and videos

Install App

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (20:08 IST)
బనకచర్ల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బనకచర్ల - గోదావరి ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని వెల్లడించారు. 
 
ఏపీ, కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పీఎఫ్ఆర్ ఇచ్చేముందు తెలంగాణాతో చర్చించివుంటే ఈ వివాదం ఉండేదికాదన్నారు. ఏపీ ప్రీ ఫ్రీజిబులిటీ రిపోర్టు ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తుందని, బనకచర్లపై కేంద్రం అన్ని రకాల చర్యలకు సిద్ధమైంది అని తెలిపారు. 
 
'ఇద్దరు సీఎంలు కూర్చొని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై చర్చిద్దాం. ఒక రోజు కాదు నాలుగు రోజులైనా చర్చిద్దాం. రాష్ట్రాల మధ్య జల వివాదాలు  చర్చల ద్వారానే పరిష్కారమవుతాయి. న్యాయ సాంకేతిక అంశాలను పరిశీలిద్ధాం. వివాదాల పరిష్కారంలో నాకెలాంటి భేషజాలు లేవు. ఇద్దరు వ్యక్తులు కాదు.. రాష్ట్రాల మధ్య వ్యవహారం ఇది. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులో మార్పులు చేస్తే చెప్పుకోవాలి. విభజన చట్టం ప్రకారం గతంలో సీఎంల స్థాయిలో చర్చలు జరిపాం. అనేక అంశాలను సీఎం స్థాయిలో చర్చించాం' అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments