Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా మారుస్తాం.. బండి సంజయ్

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (13:58 IST)
తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయాన్ని స్వర్ణ దేవాలయంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. 2020లో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల నుండి చారిత్రాత్మక చార్మినార్‌కు ఆనుకుని ఉన్న భాగ్యలక్ష్మి దేవాలయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
ఈ ప్రాంతం నుంచే బండి సంజయ్ కుమార్ 2021లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా "ప్రజా సంగ్రామ యాత్ర" ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు బీజేపీ నేతలు ఆలయంలో ప్రార్థనలు చేశారు.
 
ఈ నేపథ్యంలో ఆ ఆలయ నిర్మాణానికి స్వర్ణ దేవాలయంగా దాన్ని మార్చేందుకు రంగం సిద్ధం అవుతోందని బండి సంజయ్ ప్రకటించారు. పనిలో పనిగా కాంగ్రెస్ సర్కారుపై బండి సంజయ్ మండిపడ్డారు. రంజాన్‌కు రూ.33 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ సర్కారు బోనాల వేడుకకు కేవలం రూ.5 లక్షలు మాత్రమే కేటాయించి ఆ వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
 
బోనాల ఉత్సవాల కోసం పాతబస్తీలో 24 ఆలయాల కమిటీ ఉన్నప్పటికీ ఎనిమిది ఆలయాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు మాత్రమే కేటాయించిందన్నారు. రంజాన్ కోసం ప్రభుత్వం ఎంత ఇచ్చింది, రూ.33 కోట్లు. మనం ఏమైనా చెప్పామా? బోనాలకు రూ.5 లక్షలు ఎంత ఇచ్చారు. వారు హిందూ సమాజాన్ని బిచ్చగాళ్లలా చూస్తున్నారా' అని బండి సంజయ్ ప్రశ్నించారు.
 
పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో బోనాలు వేడుకలకు అనుమతి లేదని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ, పండుగలను నిర్భయంగా జరుపుకునే వాతావరణాన్ని కల్పిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments