Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (16:33 IST)
తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఆ రాష్ట్ర పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్టు చేశారు. మెదక్‌లో జంతు వధకు సంబంధించిన అల్లర్లు జరగడం తెల్సిందే. ఆ సమయంలో అనేక దుకాణాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో రాజ్ అరుణ్ అనే యువకుడు కత్తిపోట్లకు గురికాగా, నార్సింగ్ అనే యువకుడు రాళ్ల దాడిలో గాయపడ్డాడు. 
 
ఈ నేపథ్యంలో మెదక్ వెళ్లేందుకు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. తాను మెదక్ వెళతానని రాజా సింగ్ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమై రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. రాజాసింగ్ ఆదివారం ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు... ముందుగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. అటు మెదక్‌లో బీజేపీ శ్రేణులు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఐజీ రంగనాథ్, ఎస్పీ బాలస్వామి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments