Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

వరుణ్
ఆదివారం, 16 జూన్ 2024 (16:17 IST)
దేవభూమిగా పేరుగాంచిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ మినీ వ్యాను అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. ఈ ప్రమాదం శనివారం జరిగింది. దేవభూమిలోని పర్యాటక ప్రాంతాలను చూసొద్దామని బయలుదేరిన టూరిస్టులు రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారు. వారు ప్రయాణిస్తున్న మినీ బస్సు అదుపుతప్పి హైవే పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దాదాపు 1500 అడుగుల పైనుంచి పడడంతో బస్సు నుజ్జునుజ్జుగా మారింది. అందులోని 26 మంది టూరిస్టుల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం చోటుచేసుకుందీ దారుణం.
 
ఢిల్లీకి చెందిన 26 మంది టూరిస్టులు ఓ మినీ బస్సులో ఉత్తరాఖండ్ యాత్రకు బయలుదేరారు. శనివారం రుద్రప్రయాగ్ జిల్లా చేరుకున్నారు. రిషికేశ్-బద్రినాథ్ హైవేపై అలకనందా నది పక్క నుంచి వెళుతుండగా ప్రమాదం జరిగింది. మినీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న వారిని ఢీ కొడుతూ అలకనందా నదిలో పడిపోయింది. చాలా ఎత్తు నుంచి పడడంతో మినీ బస్సు దారుణంగా దెబ్బతింది. లోపల ఉన్న టూరిస్టుల్లో 10 మంది అక్కడికక్కడే చనిపోగా ఆస్పత్రికి తరలిస్తుండగా మరో నలుగురు కన్ను మూశారు. మిగిలిన 12 మందికి తీవ్ర గాయాలు కాగా మిగిలిన వారిని రిషికేశ్ ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments