Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (09:13 IST)
హైదరాబాద్ నగరంలో తిరిగే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కదిలే రైలు నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆమె గాయాలయ్యాయి. గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడిపోయిన ఆ యువతి అటుగా వెళుతున్న పాదాచారుడు గుర్తించి 108కు ఫోన్ చేసి సమాచారం చేరవేశాడు. దీంతో సిబ్బంది అక్కడకు వచ్చి ఆ యువతిని రక్షించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతిగా గుర్తించారు. 
 
ఈ యువతి మేడ్చల్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తుకుంటూ జీవిస్తుంది. ఈ క్రమలో సికింద్రాబాద్‌లో తన మొబైల్ ఫోనును రిపేర్ చేయించుకుని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళుతుండగా ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మహిళల బోగీలోకి ప్రవేశించిన ఓ అగంతకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి చెక్డ్ షర్డ్ ధరించి నల్లగా, సన్నగా ఉన్నాడని, సుమారు 25 యేళ్ల వయసు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వివరాల్లో పేర్కొంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారని సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ రెడ్డి తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments