Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (09:13 IST)
హైదరాబాద్ నగరంలో తిరిగే ఎంఎంటీఎస్ రైలులో ఓ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటన నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కదిలే రైలు నుంచి కిందకు దూకేసింది. దీంతో ఆమె గాయాలయ్యాయి. గుండ్లపోచంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పడిపోయిన ఆ యువతి అటుగా వెళుతున్న పాదాచారుడు గుర్తించి 108కు ఫోన్ చేసి సమాచారం చేరవేశాడు. దీంతో సిబ్బంది అక్కడకు వచ్చి ఆ యువతిని రక్షించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలిని అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన యువతిగా గుర్తించారు. 
 
ఈ యువతి మేడ్చల్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తుకుంటూ జీవిస్తుంది. ఈ క్రమలో సికింద్రాబాద్‌లో తన మొబైల్ ఫోనును రిపేర్ చేయించుకుని ఎంఎంటీఎస్ రైలులో తిరిగి వెళుతుండగా ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మహిళల బోగీలోకి ప్రవేశించిన ఓ అగంతకుడు ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 
 
తనపై అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి చెక్డ్ షర్డ్ ధరించి నల్లగా, సన్నగా ఉన్నాడని, సుమారు 25 యేళ్ల వయసు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వివరాల్లో పేర్కొంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారని సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ రెడ్డి తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devara: 28న జపాన్‌లో దేవర: పార్ట్ 1 విడుదల.. ఎన్టీఆర్‌కు జపాన్ అభిమానుల పూజలు (video)

సంబరాల యేటిగట్టు లోబ్రిటిషు గా శ్రీకాంత్ ఫస్ట్ లుక్

Yash: వచ్చే ఏడాది మార్చిలో రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్

Vijay Deverakonda: కింగ్ డమ్ సాంగ్ షూట్ కోసం శ్రీలంక వెళ్తున్న విజయ్ దేవరకొండ

Madhumita : శివ బాలాజీ, మధుమిత నటించిన జానపద గీతం గోదారికే సోగ్గాన్నే విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ సమతుల్యత: పని- శ్రేయస్సు కోసం 5 ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలు

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

తర్వాతి కథనం
Show comments