Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో తెలంగాణ విద్యార్థి మృతి.. శరీరం బుల్లెట్లతో నిండిపోయింది..

సెల్వి
గురువారం, 6 మార్చి 2025 (13:19 IST)
తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి అమెరికాలో మరణించాడు. అతని శరీరం బుల్లెట్లతో నిండిపోయిందని అతని స్నేహితులు పేర్కొన్నారు. మరణించిన విద్యార్థిని జి. ప్రవీణ్‌గా గుర్తించారు. అతని మరణానికి దారితీసిన కారణాలు స్పష్టంగా తెలియవని అతని కుటుంబ సభ్యులు బుధవారం తెలిపారు.
 
వివరాల్లోకి వెళితే.. ప్రవీణ్ విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఎంఎస్ చదువుతున్నాడు. బుధవారం అమెరికా అధికారులు అతని కుటుంబానికి సమాచారం అందించారు. ప్రవీణ్ శరీరం బుల్లెట్లతో కనిపించిందని కొంతమంది స్నేహితులు చెప్పారని ప్రవీణ్ కుటుంబీకులు తెలిపారు. ప్రవీణ్‌ను గుర్తు తెలియని దుండగులు ఒక దుకాణంలో కాల్చి చంపారని కొందరు అంటున్నారు.
 
బుధవారం తెల్లవారుజామున ప్రవీణ్ తన తండ్రికి ఫోన్ చేశాడని, కానీ అతను నిద్రపోతున్నందున కాల్ లిఫ్ట్ చేయలేక పోయాడని ప్రవీణ్ బంధువు అరుణ్ చెప్పాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ప్రవీణ్ తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారని తెలిపారు.
 
ఆ కుటుంబం హైదరాబాద్ పొరుగున ఉన్న రంగారెడ్డి జిల్లాకు చెందినది. శవపరీక్ష తర్వాత మరణానికి కారణం తెలుస్తుందని అమెరికా అధికారులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
 
 హైదరాబాద్‌లో బిటెక్ చదివిన ప్రవీణ్, 2023లో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లాడు. అతను డిసెంబర్ 2024లో భారతదేశాన్ని సందర్శించి ఈ సంవత్సరం జనవరిలో అమెరికాకు బయలుదేరాడు. కుటుంబ సభ్యులు సహాయం కోసం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను సంప్రదించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

రజనీకాంత్ 'జైలర్-2'లో 'లెజెండ్' బాలకృష్ణ? - నెట్టింట వైరల్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లాసోడా పండ్లు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా?

Sitting Poses: గంటల గంటలు కూర్చోవడం వల్ల ఆరోగ్య సమస్యలు

వేసవిలో మహిళలు ఖర్జూరాలు తింటే ఏంటి ఫలితం?

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments