Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

సెల్వి
గురువారం, 10 ఏప్రియల్ 2025 (07:46 IST)
Sathya Kumar Yadav
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని నాథూరాం గాడ్సేతో పోలుస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
 
 రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి అని, ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని సత్య కుమార్ యాదవ్ ఆరోపించారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు రేవంత్ రెడ్డి నరేంద్ర మోదీని గాడ్సేతో పోలుస్తున్నారని ఆయన అన్నారు. స్వల్ప ఒత్తిడితోనైనా పడిపోయే అవకాశం ఉన్న పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.
 
"ఇలాంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటు" అని సత్య కుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి పదవి గౌరవానికి భంగం కలిగించేలా రేవంత్ రెడ్డి అసంబద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని, ఇదంతా కేవలం తన పదవిని కాపాడుకోవడానికే మంత్రి ఆరోపించారు.

నెహ్రూ-ఇందిరా-రాజీవ్-సోనియా-రాహుల్ గాంధీ కుటుంబం కూడా భారతీయ జనతా పార్టీ (బిజెపి)ని ఆపడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ సత్య కుమార్ యాదవ్ కూడా రేవంత్ రెడ్డిపై సెటైర్లు విసిరారు. "గాంధీ కుటుంబం కూడా బీజేపీని ఆపలేకపోతే, రేవంత్ ఏం చేయగలడు" అని ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments