Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

ఐవీఆర్
శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (12:20 IST)
పిల్లల చదువులు సంగతి ఏమోగానీ పెద్దల జీతాలు, జీవితాలు బండలవుతున్నాయి. రేయనక పగలనక శ్రమించి కష్టపడి సంపాదించిన డబ్బునంతా పిల్లల చదువు రూపంలో కొన్ని ప్రైవేటు స్కూళ్లు గద్దల్లా ఎగరేసుకుపోతున్నాయి. హైదరాబాదులోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీలో పిల్లవాడిని చేర్పించేందుకు వెళితే... మొత్తం కలిపి రూ. 2,51,000 వసూలు చేసారట. పైగా తాము చెప్పే విద్యా విధానం అత్యున్నత స్థాయిలో వుంటుందనీ, ఐఐటీ, ఐఏఎస్ వంటివి తమ స్కూల్లో చదివిన వారికి నల్లేరు మీద నడకలా వుంటుందని సెలవిస్తున్నారట.
 
అంతేకాదు... ఒకేసారి అంత ఫీజు మొత్తాన్ని చెల్లించలేని తల్లిదండ్రులకు స్కూళ్లు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాయి. ఫీజు మొత్తాన్ని గృహరుణాలకు EMIలు కట్టుకున్నట్లుగా ప్రతి నెలా రూ. 21,000 EMI రూపంలో చెల్లించుకోవచ్చని అవకాశాలు ఇస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు. చదువును EMIల్లో కొనుగోలు చేయాల్సి వస్తుందన్నమాట అంటూ సెటైర్లు వేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments