Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (11:42 IST)
హైదరాబాద్ నగరంలో మరోమారు చిరుత కలకలం సృష్టంచింది. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఈ చిరుత కంటపడింది. దీంతో వాకింగ్ చేస్తున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు వచ్చిన చిరుత అక్కడ నుంచి చెట్ల పొదల్లోకి వెల్లిపోయినట్టు వాకర్స్ చెప్పారు. చిరుత పాద ముద్రలను గుర్తించిన వాకర్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. 
 
కాగా, ఈ విషయం తెలిసిన విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర నగర్‌లో గతంలో కూడా చిరుత సంచారం కలకలం రేపింది. నాలుగేళ్ల క్రితం హిమాయత్ సాగర్‌ వాలంటరీ రీసెర్స్ వ్యూమ్ హౌస్ సమీపంలో ఆవులపై చిరుత దాడి చేసిన విషయం తెల్సిందే. ఒక ఆవు దూడను చిరుత చంపడం అప్పట్లో తీవ్ర కలకలాన్ని సృష్టించింది. ఇపుడు ఏకంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆవరణలోకి చిరుత ప్రవేశించడం స్థానికులతో పాటు వాకర్స్‌ను సైతం ఆందోళనకు గురిచేస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments