Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 15 నవంబరు 2024 (22:43 IST)
kasthuri
తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు కారణంగా మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. రోజు రోజుకీ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయే యువకులు పెరుగుతున్నారు. హైదరాబాదులో ఆలయ ప్రదక్షణలు చేస్తుండగా ఒక యువకుడు, పెళ్లి బారాత్‌లో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా గుండెపోటు కారణంగా 12 ఏళ్ల బాలిక మరణించింది. ఈ ఘటన చెన్నూరు పట్టణంలోని పద్మానగర్‌ కాలనీలో చోటుచేసుకుంది.
 
పద్మానగర్ కాలనీకి చెందిన శ్రీనివాస్, రమ్య దంపతుల కుమార్తె కస్తూరి నివృత్తి ఆడుకుంటుండగా కుప్పకూలిపోయిందని స్థానికులు తెలిపారు. వెంటనే ఆమెను పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించడంతో ఆమె తల్లిదండ్రులను కలిచివేసింది. 
 
ఆమె పట్టణంలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. పవిత్రమైన కార్తీక మాసం పౌర్ణమిని రోజున పాఠశాల సెలవు కావడంతో ఇంట్లో ఆడుకుంటూ కనిపించిన బాలిక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ ఇంట విషాదాన్ని నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments