Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్

Webdunia
సోమవారం, 27 నవంబరు 2023 (09:36 IST)
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, నవంబర్ 28 సాయంత్రం 5 గంటల నుండి నవంబర్ 30న పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లతో సహా అన్ని మద్యం దుకాణాలు మూసివేయబడతాయని ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. 
 
రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలి. ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు బంద్ కానున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ ముగిసే వరకు వైన్ షాపుల యజమానులు తెరుచుకోవద్దని ఈసీ సూచించింది. 
 
ఈసీ ఆదేశాలను ఉల్లంఘించి వైన్ షాపు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈసీ హెచ్చరించింది. ఈసీ ఆదేశాల మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 48 గంటల పాటు మద్యం, ఇతర పదార్థాల విక్రయాలపై పూర్తి నిషేధం అమలు చేసేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
 
అదేవిధంగా అక్రమ మద్యం రవాణాపై నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఈసీ ఆదేశించింది. ఎన్నికల సందర్భంగా పంపిణీ చేస్తున్న రూ.115.71 కోట్ల విలువైన మద్యం, డ్రగ్స్‌ను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments