Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల గుర్తు కంటే మీరే అందంగా ఉన్నారు....

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (14:58 IST)
ఎన్నికల గుర్తు కంటే మీరే అందంగా ఉన్నారు అంటూ ఓ స్వతంత్ర మహిళా అభ్యర్థిని ఉద్దేశించి రిటర్నింగ్ అధికారి చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ అయ్యాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో మంగిలిపల్లి భార్గవి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, శుక్రవారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వం జూనియర్ కాలేజీలో మాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా తనకు కేటాయించిన బేబీ వాకర్ గుర్తు ఈవీఎంలో సరిగా కనిపించడం లేదంటూ రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డికి చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఎన్నికల గుర్తు కంటే మీరే చాలా బాగున్నారు అన శ్రీనివాస్ రెడ్డి కామెంట్స్ చేశారు. దీంతో ఆమె నొచ్చుకున్నారు. 
 
రిటర్నింగ్ అధికారి తన పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఆమె ఇతర స్వతంత్ర అభ్యర్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. నిరుద్యోగంతో బాధపడుతున్న తాను సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తున్నానని, తన పట్ల అవమానకరంగా వ్యవహరించిన ఆర్డీవోపై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీల మహిళా అభ్యర్థుల విషయంలో ఇలానే వ్యవహరిస్తారా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. మరోవైపు, ఈ అంశంపై శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ తాను ఒక్క మాట కూడా అసభ్య పదజాలాన్ని ఉపయోగించలేదని వివరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments