Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహినూర్ గ్రూప్ ఎండీ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (13:20 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడింది. అయితే ఐటీ దాడులు మాత్రం ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఒకచోట ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం పాతబస్తీలోని బడా వ్యాపారులపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. 
 
శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు అందుతున్నట్లు సమాచారం అందడంతో ఐటీ శాఖ దాడులు చేసింది. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగుతాయని సమాచారం. 
 
పాతబస్తీతో పాటు హైదరాబాద్ శాస్త్రిపురంలో కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్ ఎండీ మాజీద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్త షానవాజ్‌తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 
 
కోహినూర్ కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నడుపుతున్న వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 
 
ఈ దాడుల్లో ఐటీ శాఖ అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్ కూడా ఉన్నారు. పాతబస్తీకి చెందిన బడా వ్యాపారులనే లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments