Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహినూర్ గ్రూప్ ఎండీ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు

Webdunia
శనివారం, 25 నవంబరు 2023 (13:20 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడింది. అయితే ఐటీ దాడులు మాత్రం ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఒకచోట ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం పాతబస్తీలోని బడా వ్యాపారులపై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. 
 
శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఓ రాజకీయ పార్టీకి భారీగా డబ్బు అందుతున్నట్లు సమాచారం అందడంతో ఐటీ శాఖ దాడులు చేసింది. సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగుతాయని సమాచారం. 
 
పాతబస్తీతో పాటు హైదరాబాద్ శాస్త్రిపురంలో కూడా ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. కోహినూర్ గ్రూప్ ఎండీ మాజీద్ ఖాన్ ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపారవేత్త షానవాజ్‌తో పాటు పలువురు ప్రముఖుల ఇళ్లలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. 
 
కోహినూర్ కింగ్స్ గ్రూపుల పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు నడుపుతున్న వ్యాపారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమానుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. 
 
ఈ దాడుల్లో ఐటీ శాఖ అధికారులతో పాటు సీఐఎస్ఎఫ్ కూడా ఉన్నారు. పాతబస్తీకి చెందిన బడా వ్యాపారులనే లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాన్నా పవన్... మా సమస్యలు ఓ సారి వినరాదూ!! : డిప్యూటీ సీఎంకు పరుచూరి విన్నపం (Video)

తిరగబడరసామీ లో యాక్షన్, ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్ చాలా కొత్తగా వుంటుంది : రాజ్ తరుణ్

శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రాబోతుంది

కొరియోగ్రాఫర్ నుంచి అధ్యక్షుడిగా ఎదిగిన జానీ మాస్టర్

20 కోట్ల బడ్జెట్ తో పీరియాడిక్ థ్రిల్లర్ గా హీరో కిరణ్ అబ్బవరం చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

పిల్లలకు నచ్చే మలాయ్ చికెన్ ఇంట్లోనే చేసేయవచ్చు.. ఇలా..?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments