కావలసిన పదార్థాలు: బియ్యం - పావు కప్పు పాలు - 2 కప్పులు యాలకులు - 2 కిస్మిస్ - 25 గ్రాములు కుంకుమపువ్వు - కొద్దిగా తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. ఆ
ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. ఆ తరువాత ఈ బియ్యాన్ని మిక్సీలో బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాత్రలో పాలు పోసి అవి కాగిన తరువాత బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసుకుని రవ్వ మెత్తబడేవరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. వేడి పాలలో కుంకుమపువ్వును నానబెట్టుకుని పాయసంలో కలుపుకోవాలి. చివరగా చక్కెర వేసుకుని 3 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే బియ్యం పాయసం రెడీ.