Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతులలో లడ్డూలా.. ఎలా చేయాలో చూద్దాం...

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (11:24 IST)
మెంతులు అజీర్తిని తగ్గిస్తాయి. మెంతుల మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య ఉండదు. దాంతో జుట్టు రాలకుండా ఉంటుంది. మెంతులతో రకరకాల వంటలు చేస్తుంటారు.. కానీ ఎప్పుడైనా లడ్డూలు తయారుచేసున్నారా.. మరి ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు:
మెంతులు - 1 కప్పు
పాలు - అరలీటరు
గోధుమపిండి - 300 గ్రాములు
నెయ్యి - 250 గ్రాములు
శొంఠి - 2 స్పూన్స్
బాదం - అరకప్పు
మిరియాలు - కొన్ని
జీలకర్ర పొడి - 2 స్పూన్స్
ఇలాయిచీ - 10
దాల్చిన చెక్క - 4
జాజికాయలు - 2
చక్కెర - 300 గ్రాములు
 
తయారీ విధానం:
ముందుగా మెంతులను బాగా కడిగి ఒక బట్టలో కట్టాలి. ఆ తరువాత నీళ్ళు పోయేంతవరకు ఎండలో ఉంచాలి. తరువాత కాసేపు ఆరబెట్టి మిక్సీలో రుబ్బుకోవాలి. మెత్తగా కాకుండా పొడిలా ఉండేలా పట్టాలి. ఇప్పుడు పాలు వేసిచేసుకుని చల్లార్చాలి. ఈ పాలలో మెంతుల పొడి పోసి ముద్దల్లా కలుపుకోవాలి. ఇలా చేసిన వాటిని 8 గంటల పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత మిరియాలు, దాల్చినచెక్క, జాజికాయలను పొడి చేయాలి.
 
ఇప్పుడు బాణలిలో నెయ్యి వేసి పాలలో నానబెట్టిన మెంతుల పిండిని వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఈ మిశ్రమాన్ని ఓ గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో నెయ్యి వేసి అందులో చక్కెర, జీలకర్ర పొడి, శొంఠి, బాదం పప్పులు, ఇలాయిచీ, మిరియాలతో చేసిన పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం పాకంలా వస్తుంది. అప్పటి వరకు అలానే ఉంచాలి. ఆ తరువాత ముందుగా తయారుచేసుకున్న మెంతుల మిశ్రమాన్ని ఆ పాకంలో వేసి కలుపుకుని చల్లారాక నిమ్మకాయ సైజుల్లో లడ్డూలను చేసుకోవాలి. అంతే... మెంతులు లడ్డూలు రెడీ.  

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments