ఈ స్వీట్ పిల్లలకి చేసి పెడితే లొట్టలేసుకుని తింటారంతే...

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:18 IST)
కరోనావైరస్ కారణంగా ఇపుడు బయట స్వీట్ షాపుల్లో ఏమి తినాలన్నా భయంగా వుంటుంది. అందువల్ల చక్కగా ఇంట్లోనే స్వీట్ పదార్థాలను తయారు చేసి పిల్లలకి పెడుతుంటే టేస్టీగా లాగించేస్తారు. ముఖ్యంగా కొబ్బరి తురుముతో చేసిన మైసూర్ పాక్ సూపర్ టేస్టీగా వుంటుంది. అదెలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
శనగపిండి- ఒక కప్పు, 
కొబ్బరితురుము- ఒక కప్పు
పాలు- ఒక కప్పు,
నెయ్యి- ఒక కప్పు,
పంచదార- రెండు కప్పులు,
జీడిపప్పు- కొద్దిగా
 
తయారుచేసే విధానం : 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని చిన్నచిన్న సమభాగాలు కట్‌ చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అనంతపురం జిల్లాను వణికించిన హనీట్రాప్ క్రైమ్.. నలుగురు పోలీసులు సస్పెండ్

హైదరాబాద్‌లో వడగళ్ల వర్షం.. కాశ్మీర్ లేదా హిల్ స్టేషన్‌లో ఉన్నామా? (video)

విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన

వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు: అనంత ఉదయ భాస్కర్‌ కస్టడీపై పిటిషన్

వాకింగ్‌కు వెళ్లినా వదలరా? హైదరాబాదులో మహిళకు వేధింపులు.. వీడియో

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: జన నాయగన్.విజయ్ కు తిరుచెందూర్‌లో అపూర్వ ఆదరణ

Shruti Haasan: రామ్ చరణ్.. పెద్ది లో శ్రుతిహాసన్ ఐటెంసాంగ్ లుక్ ?

Faria Abdulla: సత్య’నుంచి ‘పెళ్లి చూపులు వరకు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం : ఫరియా

కింగ్ నాగార్జున సరసన మళ్లీ కలిసి నటించబోతున్న టబు

పాప్ ఐకన్ మైఖేల్ జాక్సన్ బయోపిక్ మైఖేల్ చిత్రానికి కాసుల వర్షం, వారంలోనే రూ. 2 వేల కోట్లు

తర్వాతి కథనం
Show comments