Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ స్వీట్ పిల్లలకి చేసి పెడితే లొట్టలేసుకుని తింటారంతే...

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (21:18 IST)
కరోనావైరస్ కారణంగా ఇపుడు బయట స్వీట్ షాపుల్లో ఏమి తినాలన్నా భయంగా వుంటుంది. అందువల్ల చక్కగా ఇంట్లోనే స్వీట్ పదార్థాలను తయారు చేసి పిల్లలకి పెడుతుంటే టేస్టీగా లాగించేస్తారు. ముఖ్యంగా కొబ్బరి తురుముతో చేసిన మైసూర్ పాక్ సూపర్ టేస్టీగా వుంటుంది. అదెలా చేయాలో చూద్దాం.
 
కావలసిన పదార్థాలు :
శనగపిండి- ఒక కప్పు, 
కొబ్బరితురుము- ఒక కప్పు
పాలు- ఒక కప్పు,
నెయ్యి- ఒక కప్పు,
పంచదార- రెండు కప్పులు,
జీడిపప్పు- కొద్దిగా
 
తయారుచేసే విధానం : 
మొదట బాణలి పెట్టి రెండు చెంచాల నెయ్యి వేసి కరిగించాలి. అందులో సెనగపిండి వేయించి, కమ్మని వాసన వచ్చిన తర్వాత ఓ పళ్లెంలోకి తీసుకోవాలి. చల్లారాక అందులో పంచదార, కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ పిండిలో పాలు పోసి పొయ్యిమీద పెట్టాలి.
 
మధ్యమధ్యలో కరిగించిన నెయ్యిని చేర్చుతూ బాగా దగ్గరగా అయ్యేదాకా కలుపుతూ ఉండాలి. మిశ్రమం సిద్ధమయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకొని చిన్నచిన్న సమభాగాలు కట్‌ చేసుకుంటే సరిపోతుంది. పైన జీడిపప్పుతో అలంకరించుకోవాలి. నోరూరించే కొబ్బరి మైసూర్ పాక్ రెడీ అయినట్టే.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments