Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : పతకానికి మరింత చేరువకు చేరిన సింధు

Webdunia
గురువారం, 29 జులై 2021 (08:05 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్)లో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది. 
 
ఈ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ బ్లింక్‌ ఫెల్ట్‌‌పై 21-15, 21-13 తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. దీంతో ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. 
 
తొలి సెట్‌ను 21-15 తేడాతో సులువుగా గెలుచుకున్న సింధు, రెండో సెట్‌ను 21-13 తేడాతో మరింత సునాయాసంగా గెలుచుకుంది. దీంతో మొత్తం 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. ఈ గెలుపుతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. 
 
కాగా, రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన సింధు ఈసారి మొదటి మ్యాచ్ నుంచే పతక వేటలో పడింది. మునుముందు కూడా ఈ దూకుడును సింధు ఇలాగే కొనసాగిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

తర్వాతి కథనం
Show comments