Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : పతకానికి మరింత చేరువకు చేరిన సింధు

Webdunia
గురువారం, 29 జులై 2021 (08:05 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్)లో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది. 
 
ఈ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ బ్లింక్‌ ఫెల్ట్‌‌పై 21-15, 21-13 తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. దీంతో ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. 
 
తొలి సెట్‌ను 21-15 తేడాతో సులువుగా గెలుచుకున్న సింధు, రెండో సెట్‌ను 21-13 తేడాతో మరింత సునాయాసంగా గెలుచుకుంది. దీంతో మొత్తం 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. ఈ గెలుపుతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. 
 
కాగా, రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన సింధు ఈసారి మొదటి మ్యాచ్ నుంచే పతక వేటలో పడింది. మునుముందు కూడా ఈ దూకుడును సింధు ఇలాగే కొనసాగిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dantewada: దంతెవాడ 71మంది నక్సలైట్లు లొంగిపోయారు

రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కేంద్రం కేబినెట్

Chandra Babu: అమరావతిలో బ్యాంకులను ఏర్పాటు చేయండి.. చంద్రబాబు

దొంగబాబా.. ఢిల్లీలో మహిళా విద్యార్థులపై లైంగిక వేధింపులు

స్కూలుకని చెప్పి ప్రియుడితో సరసాలు, రెడ్ హ్యాండెడ్‌గా పట్టేసిన తల్లి ఏం చేసింది (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: మాస్ జాతర చిత్ర విడుదలతేదీని ప్రకటించిన నిర్మాత నాగ వంశీ

Naga vamsi: ఓజీ హైప్ అయిపోయింది, అంతా ఉత్సాహంగా ఉంది అంటున్న నాగవంశీ

CM: కర్నాటక ముఖ్యమంత్రిని, సూపర్ స్టార్ సుదీప్ ను కలిసిన మంచు మనోజ్

OG: ఓజీ కోసం థియేటర్లు వదులుకున్న ఓ నిర్మాత - పబ్లిసిటీచేస్తున్న మరో నిర్మాత

Nayanthara : సిద్దు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి కెమిస్ట్రీ బాగుందన్న నయనతార

తర్వాతి కథనం
Show comments