Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్ : పతకానికి మరింత చేరువకు చేరిన సింధు

Webdunia
గురువారం, 29 జులై 2021 (08:05 IST)
టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగమ్మాయి పీవీ సింధు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం రౌండ్ ఆఫ్ 16 (ప్రీక్వార్టర్)లో జరిగిన మ్యాచ్‌లో వరుసగా మూడో విజయం సాధించింది. దీంతో సింధు క్వార్టర్‌ ఫైనల్స్‌ చేరింది. 
 
ఈ మ్యాచ్‌లో డెన్మార్క్‌కు చెందిన ప్రపంచ 12వ ర్యాంకర్ బ్లింక్‌ ఫెల్ట్‌‌పై 21-15, 21-13 తేడాతో గెలిచింది. తొలి రెండు మ్యాచుల మాదిరిగానే ఈ మ్యాచ్‌లో కూడా సింధు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యం కనబర్చింది. దీంతో ప్రత్యర్థి ఫెల్ట్ ఏ దశలోనూ ఆమెను నిలువరించలేకపోయింది. 
 
తొలి సెట్‌ను 21-15 తేడాతో సులువుగా గెలుచుకున్న సింధు, రెండో సెట్‌ను 21-13 తేడాతో మరింత సునాయాసంగా గెలుచుకుంది. దీంతో మొత్తం 40 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. ఈ గెలుపుతో సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. 
 
కాగా, రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన సింధు ఈసారి మొదటి మ్యాచ్ నుంచే పతక వేటలో పడింది. మునుముందు కూడా ఈ దూకుడును సింధు ఇలాగే కొనసాగిస్తే భారత్ ఖాతాలో మరో పతకం చేరడం ఖాయం.   

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments