Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్‌.. ఖుషీ ఖుషీగా భారత్.. పుడ్ విషయంలో ఢోకా లేదు..

Webdunia
బుధవారం, 21 జులై 2021 (17:19 IST)
టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల నుంచి అథ్లెట్లు ఒలింపిక్ విలేజ్‌కు చేరుకున్నారు. ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు. అయితే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభ వేడుకకు భారత ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్ బాత్రా డుమ్మా కొట్టనున్నాడు. ఆయన జపాన్‌కు వెళుతున్నారు కానీ.. ఆ సమయంకల్లా క్వారంటైన్‌లో ఉంటారని సమాచారం.
 
ఈ క్రమంలోనే ఆయన ఓపెనింగ్ సెరిమొనీకి హాజరు కారని తెలిసింది. ఒలింపిక్ స్టేడియంలో జరిగే ప్రారంభ వేడుకలకు ప్రతి జట్టు నుంచి ఆరుగురుకి మాత్రమే అనుమతించారు నిర్వాహకులు. ఇక క్వారంటైన్‌లో ఉంటున్నవారు కూడా ప్రారంభ వేడుకలకు హాజరుకారాదని సమావేశంలో నిర్ణయించారు. ఒలింపిక్స్ గేమ్స్‌ సందర్భంగా క్రీడాగ్రామంలో భారత అథ్లెట్లకు మూడు అంతస్తులు ఉన్న భవనం ఇచ్చారు. 
 
128 మందితో కూడిన భారత బృందంతో పాటు ఈ అంతస్తులో దక్షిణాఫ్రికా మరియు బెల్జియం అథ్లెట్లు కూడా షేర్ చేసుకోకున్నారు. అంటే ఈ రెండు దేశాలకు చెందిన క్రీడాకారులకు కూడా ఇదే అంతస్తులో బస చేయనున్నారు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికా ఫుట్ ‌బాల్ ప్లేయర్లలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ట్రైనింగ్ సెషన్ రద్దు అయ్యింది. జట్టులోని మిగతా సభ్యులు క్వారంటైన్‌లోకి వెళ్లారు. 
 
జూలై 21 నుంచే ఫుట్‌బాల్, సాఫ్ట్‌బాల్ మరియు బేస్‌బాల్ లాంటి గేమ్స్ ప్రారంభం అయ్యాయి. ఇక టోక్యో ఒలింపింక్ విలేజ్‌లో భారతీయ క్రీడాకారులు బసచేస్తున్నారు. ఆతిథ్యం పరంగా ఎలాంటి డోకా లేదంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇక భారత క్రీడాకారుల ఆహార విషయానికొస్తే.. వీరికోసం చోలే భటూరే, నాన్, ఓక్రా, వంకాయ లాంటి శాఖాహారం వడ్డిస్తున్నారట. ఇక మాంసాహారం విషయానికొస్తే ఎలాంటి సెలెక్టివ్ మెనూ లేదట. ఏదైనా తినేందుకు వెసులుబాటు కల్పించినట్లు సమాచారం. 
 
ఒలింపిక్స్ గేమ్స్ విలేజ్‌లో క్రీడాకారులు ఎక్కడైనా తిరిగేలా ఏర్పాటు చేశారు. కరోనా ఉందని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. అయితే అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుని మాత్రమే బయటకు అడుగుపెట్టాలనే నిబంధన పెట్టారు. ఈ క్రమంలోనే భారత క్రీడాకారులు మాత్రం చాలా పరిమితంగా బయట తిరుగుతున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments