Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వింబుల్డన్‌లో సత్తా చాటిన సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్‌లో అరుదైన రికార్డ్

వింబుల్డన్‌లో సత్తా చాటిన సానియా మీర్జా.. టోక్యో ఒలింపిక్స్‌లో అరుదైన రికార్డ్
, గురువారం, 1 జులై 2021 (22:13 IST)
sania mirza
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రతిష్టాత్మక వింబుల్డన్‌లో సత్తా చాటింది. వింబుల్డన్ మహిళల డబుల్స్ విభాగం తొలి రౌండ్లో గెలుపును నమోదు చేసుకుంది. ఆరో సీడ్ అయిన డిసారై మరియు అలెక్సా గురాచీలపై సానియా జోడీ 7-5, 6-3 పాయింట్ల తేడాతో విజయం సాధించి రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది.

అమెరికా పార్ట్‌నర్ బెథానీతో కలిసి గురువారం జరిగిన తొలి రౌండ్లో మెరుగ్గా ఆడింది. ఫలితంగా తొలి డబుల్స్ రౌండ్ ఇండో-అమెరికా జోడీ వశమైంది. ఈ మ్యాచ్‌ను ఒక గంటా 27 నిమిషాల్లో సొంతం చేసుకుంది సానియా జోడీ. 
 
ఇకపోతే.. సానియా మీర్జా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్ 2020​తో భారత్​ తరఫున నాలుగు ఒలింపిక్స్​ల్లో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్​గా సానియా మీర్జా నిలవనుంది.

జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సమ్మర్ గేమ్స్ కోసం సిద్ధమవుతున్న ఈ భారత టెన్నిస్ స్టార్.. మైదానంలోనే కాకుండా బయట కూడా కష్టపడుతున్నానని చెప్పింది. కోర్టులో చురుకుగా కదిలేందుకు చాలా కసరత్తులు చేస్తున్నట్లు తెలిపింది. అంకితా రైనాతో కలిసి సానియా.. టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతోంది.
 
2018లో ఇజాన్​కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్​ గెలిచి సెకండ్​ ఇన్నింగ్స్​ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్​బోర్న్​ ఇంటర్నేషనల్​ ఈవెంట్​లో తొలి రౌండ్​లోనే సానియా నిరాశపరిచింది. బెతాని మ్యాటెక్‌ సాండ్స్‌ (అమెరికా)తో జతకట్టిన హైదరాబాదీకి తొలి రౌండ్‌లోనే చుక్కెదురైంది. ప్రస్తుతం వింబుల్డన్, ఒలింపిక్స్​లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే వింబుల్డన్ తొలి డబుల్స్ రౌండ్లో గెలుపును నమోదు చేసుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డబ్ల్యూటీసీ ఫైనల్లో చేతులెత్తేశాయ్.. పెళ్లాంతో ఫోటోలా..? బుమ్రాపై ట్రోలింగ్