Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్ నగరంలో సానియా మీర్జా చివరి మ్యాచ్

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (10:57 IST)
హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆదివారం ఆడనుంది. హైదరాబాద్ నగరంలో ఆమె ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతుంది. రోహాన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్‌, ‌బెథానీలతో కలిసి ఆమె ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సానియా అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరుకానున్నాయి. డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహాన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్, మరియోన్ బర్తోలితో విమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతుంది.
 
ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌పై సానియా స్పందిస్తూ, "నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్ నగరంలో సొంత అభిమానులు, ప్రేక్షకుల ముందు ఆడి వారి నా కృతజ్ఞత తెలపాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. నా కెరీర్ ప్రారంభమైన చోటుకే తిరిగి రావడం వ్యక్తిగతంగా నాకు గొప్పగా అనిపిస్తుంది. నా ఈ ప్రయాణం, అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను వారి కలలను నెరవేర్చుకోవాడనికి, లక్ష్యాలను సాధించుకోవడానికి కష్టపడి పనిచేసేలా స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments