Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు.. వైజాగ్‌లో బ్యాడ్మింటన్ అకాడెమీ

Webdunia
శుక్రవారం, 13 సెప్టెంబరు 2019 (16:12 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పివి సింధు వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను కలిసారు. క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పివి సింధు తల్లిదండ్రులు పివి రమణ, లక్ష్మి, క్రీడాసంఘాల ప్రతినిధి ఛాముండేశ్వరీనాద్, అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, శాప్‌ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌తో భేటీ అయ్యారు. 
 
ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ పోటీల్లో సాధించిన బంగారు పతకాన్ని ముఖ్యమంత్రికి చూపించారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆమెను అభినందించారు. పివి సింధును శాలువతో సత్కరించారు. అనంతరం సెక్రటేరియట్‌‌లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి పివి సింధు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తనను అభినందించడం సంతోషంగా వుందన్నారు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ అండగా వుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. 
 
అలాగే విశాఖపట్నంలో ఐదు ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్పడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడం పట్ల ఆనందంగా ఉందన్నారు. పద్మభూషణ్‌ కోసం కేంద్రం తన పేరును నామినేట్‌ చేసినట్లు తెలిసిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు.
 
బంగారు పతకం సాధించిన తరువాత మొట్టమొదటి సారిగా మన రాష్ట్రానికి వచ్చిన బ్యాడ్మింటెన్‌ క్రీడాకారిణి పివి సింధుకు ఘనంగా ఆహ్వానం పలికామని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఆమె ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ను మర్యాదపూర్వకంగా కలిశారని, పీవీ సింధు సాధించిన విజయం పట్ల సీఎం చాలా సంతోషం వ్యక్తంచేశారన్నారు. అలాగే భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని సీఎం మనస్పూర్తిగా ఆకాంక్షించారన్నారు. 
 
రాబోయే ఒలంపిక్స్‌ క్రీడల్లో పివి సింధు గోల్డ్‌ మెడల్‌ సాధించాలని సీఎం ఆకాక్షించారని చెప్పారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడపిల్లలకు ఒక బ్యాడ్మింటన్‌ అకాడమీ వుంటే బాగుంటుందని పివి సింధు కోరిన మీదట విశాఖపట్నంలో 5 ఎకరాలను కేటాయిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం అండగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. మన తెలుగు అమ్మాయి అయిన సింధూకు అన్నిరకాల ప్రోత్సాహం ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments