Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ పారాలింపిక్స్ పోటీలు : స్ప్రింటర్ ప్రీతి పాల్‌కు కాంస్యం

ఠాగూర్
శుక్రవారం, 30 ఆగస్టు 2024 (18:25 IST)
పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌ పోటీల్లో భారత్‌కు మరో పతకం లభించింది. స్ప్రింటర్‌ ప్రీతి పాల్‌ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మహిళల 100మీ. టీ35 విభాగం ఫైనల్‌లో ఆమె మూడో స్థానం దక్కించుకుంది. 14.21 సెకన్లలో తన రేసును ముగించారు. చైనాకు చెందిన అథ్లెట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించిన ప్రీతిపాల్.. ఆమె పుట్టినప్పుడే శారీరక సమస్యలు ఎదుర్కొంది. కాళ్లలో సత్తువ కోసం పలు చికిత్సలు చేయించుకుంటోంది. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా పారాలింపిక్స్ పోటీల్లో తన సత్తా చాటి కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. 
 
పారిస్ పారాలింపిక్స్ పోటీలు : షూటింగ్‌లో బంగారు పతకం 
 
పారిస్ వేదికగా పారాలింపిక్స్ క్రీడా పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలో భారత అమ్మాయిలు అదరగొట్టారు. షూటింగ్‌‍లో బంగారు పతకం గెలుచుకోగా, ఇతర విభాగాల్లో కూడా కాంస్య విగ్రహం వరించింది. 
 
పారాలింపిక్స్ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్‌ 1లో బంగారు పతకం సాధించింది. దాంతో రెండో రోజు భారత్ పతకాల జాబితాలో ఖాతా తెరిచినట్టయింది. ఇదే ఈవెంట్‌లో మోనా అగర్వాల్ కూడా తలపడింది. ఆమె కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 
 
ఇదిలావుంటే, టోక్యో పారాలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో పసిడి పతకం గెలిచిన 22 యేళ్ళ రాజస్థాన్ అమ్మాయి అవని... 50 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ త్రీ పొషిజన్స్‌లో కాంస్యం నెగ్గిన సంగతి తెల్సిందే. ఇపుడు పారిస్ పారాలింపిక్స్‌లోనూ అదే జోరు కొనసాగించి, పసిడి పతకం ఒడిసి పట్టుకున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ ఫ్యామిలీ కోసం ఇంతకాలం భరించా.. కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి : బాలినేని

తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రమాణం చేద్దామా: వైవీ సుబ్బారెడ్డికి కొలికిపూడి సవాల్

శ్రీవారి లడ్డూలో చేప నూనె - బీఫ్ టాలో - పంది కొవ్వు వినియోగం...

ఏపీలో కొత్త మద్యం పాలసీ.. రూ.99కే క్వార్టర్ బాటిల్!

తిరుపతి లడ్డూ తయారీలో ఆవు నెయ్యి స్థానంలో జంతువుల కొవ్వు కలిపారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

తర్వాతి కథనం
Show comments