Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ క్రీడలు - భారత్ ఖాతాలో ఐదు స్వర్ణాలు

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (16:59 IST)
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ క్రీడారాలు మంచి ప్రతిభను కనపరుస్తున్నారు. ఓవరాల్‌గా 18 పతకాలు సాధించారు. వీటిలో ఐదు బంగారు పతకాలు, ఆరు రజతం, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి. అయితే, బంగారు పతకాల పట్టికలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. 
 
గురువారం పురుషుల లాంగ్‌జంప్‌ ఫైనల్‌లో మహమ్మద్ అనీస్, శ్రీశంకర్‌ పతకం కోసం బరిలోకి దిగుతున్నారు. బాక్సింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో పతకాల పంట పండుతోంది. ఈ క్రమంలో వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలు సాధించిన లిఫ్టర్లు తమ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. 
 
మీరాబాయి చాను, జెరెమీ లాల్రినుంగా, ఆచింత సూయిలీ వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో మీరాబాయి చాను తన సోషల్‌ మీడియా ట్విటర్‌లో ముగ్గురు కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. 'ది గోల్డెన్‌ ట్రయో' అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున స్పందించారు. 41 వేలకుపైగా లైకులు, రెండువేల వరకు రిట్వీట్‌లు వచ్చాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments