Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారాలింపిక్స్‌లో పతకాల పంట : మనీష్‌కు స్వర్ణం, సింఘరాజ్‌కు రజతం

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:37 IST)
టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో శనివారం భారత్‌కు వరసగా రెండు పతకాలు లభించాయి. షూటర్లు మనీష్ నర్వాల్, సింఘరాజ్ అదానాలు రెండు పతకాలు సాధించారు. 
 
ఈ పోటీల్లో భాగంగా, శనివారం జరిగిన పురుషుల పి 4 మిక్స్‌డ్ 50 మీటర్ల పిస్టల్ ఎస్.హెచ్ 1 పోటీల్లో మనీష్ నర్వాల్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అలాగే, సింఘరాజ్ అదానా రజతపతకం సాధించారు.
 
దీంతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. మరోవైపు, ఇప్పటివరకు భారత్‌కు పారా ఒలింపిక్స్‌లో 15 పతకాలు భారత్ ఖాతాలో వచ్చిచేరాయి. 
 
మరోవైపు, 19 ఏళ్ల షూటర్ మనీష్ పారా ఒలింపిక్ రికార్డు సృష్టించాడు. మనీష్ బంగారు పతకం కైవసం చేసుకోవడానికి 218.2 పాయింట్లు సాధించాడు, సింఘరాజ్ 216.7 పాయింట్లతో టోక్యో పారా ఒలింపిక్స్‌లో తన రెండో పతకాన్ని సాధించాడు. రష్యన్ పారాలింపిక్ కమిటీ సెర్గీ మలిషేవ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments