Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం కండువా కప్పుకున్న మల్లయోధురాలు

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:40 IST)
ప్రముఖ మల్లయోధురాలు (ఇంటర్నేషనల్ రెజ్లర్) బబితా ఫోగట్ కాషాయం జెండా కప్పుకున్నారు. గత కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం అందించిన ఈ క్రీడాకారిణి, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించి, ఆ తర్వాత బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. ఆమెతో పాటు.. ఆమె తండ్రి మహావీర్ ఫోగట్ కూడా బీజేపీలో చేరారు. 
 
మల్లవిద్యలో తన కుమార్తెలకు శిక్షణ ఇచ్చి వారిని విజయపథంలో నడిపిన మహావీర్ ఫొగట్ ప్రముఖ బాలీవుడ్ చిత్రం దంగల్‌కు స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ హర్యానా శాఖ ఇంచార్జి అనిల్ జైన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా సమక్షంలో వారు బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. 
 
కాగా, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి మోడీ చరిత్ర సృష్టించారని, ఆయనకు తాను వీరాభిమానినని బబిత చెప్పారు. కాశ్మీరీ వధువుల గురించి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న హర్యానా సీఎం ఖట్టర్‌కు ఆమె బాసటగా నిలిచారు. ఆయన ఎలాంటి తప్పుడు ప్రకటన చేయలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

తర్వాతి కథనం
Show comments