Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాషాయం కండువా కప్పుకున్న మల్లయోధురాలు

Webdunia
మంగళవారం, 13 ఆగస్టు 2019 (11:40 IST)
ప్రముఖ మల్లయోధురాలు (ఇంటర్నేషనల్ రెజ్లర్) బబితా ఫోగట్ కాషాయం జెండా కప్పుకున్నారు. గత కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి బంగారు పతకం అందించిన ఈ క్రీడాకారిణి, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించి, ఆ తర్వాత బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. ఆమెతో పాటు.. ఆమె తండ్రి మహావీర్ ఫోగట్ కూడా బీజేపీలో చేరారు. 
 
మల్లవిద్యలో తన కుమార్తెలకు శిక్షణ ఇచ్చి వారిని విజయపథంలో నడిపిన మహావీర్ ఫొగట్ ప్రముఖ బాలీవుడ్ చిత్రం దంగల్‌కు స్ఫూర్తిగా నిలిచిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ హర్యానా శాఖ ఇంచార్జి అనిల్ జైన్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా సమక్షంలో వారు బీజేపీ సభ్యత్వం స్వీకరించారు. 
 
కాగా, జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దుచేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసి మోడీ చరిత్ర సృష్టించారని, ఆయనకు తాను వీరాభిమానినని బబిత చెప్పారు. కాశ్మీరీ వధువుల గురించి వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్న హర్యానా సీఎం ఖట్టర్‌కు ఆమె బాసటగా నిలిచారు. ఆయన ఎలాంటి తప్పుడు ప్రకటన చేయలేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NASA: నాసా అధికారిక వెబ్‌సైట్‌లో బగ్‌ను గుర్తించిన 16 ఏళ్ల బాలుడు.. హ్యాట్సాఫ్!

బాలికలకు హాని చేయాలంటేనే భయపడాలి.. తాట తీయండి: చంద్రబాబు

హైదరాబాద్‌తో తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

DOST 2025: వెబ్‌సైట్‌లో సెల్ఫ్ -రిపోర్ట్ చేయడంలో 19వేల మంది అభ్యర్థులు విఫలం

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

తర్వాతి కథనం
Show comments