Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడో రోజు వరుసగా లాభపడిన స్టాక్ మార్కెట్..

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (10:12 IST)
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమయ్యాయి. భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీ తొలుత 250 పాయింట్లు జంప్‌చేసింది. ప్రస్తుతం 217 పాయింట్లు బలపడి 38,745కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ 60 పాయింట్లు ఎగసి 11,440 వద్ద ట్రేడవుతోంది. 
 
మంగళవారం అమెరికన్‌ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ సరికొత్త గరిష్టాలను అందుకోగా.. ఆసియాలో మార్కెట్లు ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను కైవసం చేసుకుంటున్నాయి. ఇంకా ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహం, దేశీయంగా బలపడిన సెంటిమెంటు నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాలు ఆర్జించాయి. 
 
ఇకపోతే.. పీఎస్‌యూ బ్యాంక్స్‌ అత్యధికంగా 2.3 శాతం లాభపడగా... ఆటో, ప్రైవేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ కాస్త పుంజుకున్నాయి. ఎస్‌బీఐ, హీరో మోటో, అదానీ పోర్ట్స్‌, ఇన్‌ప్రాటెల్‌, ఐసీఐసీఐ, గెయిల్‌, సన్‌ ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎంఅండ్‌ఎం, ఎల్‌అండ్‌టీ, జీ, ఐటీసీలు లాభపడగా, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసిమ్‌, నెస్లే, ఇన్ఫోసిస్‌, కొటక్‌ బ్యాంక్‌, టాటా స్టీల్‌ వంటి సంస్థలు నష్టాలను చవిచూశాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments