Webdunia - Bharat's app for daily news and videos

Install App

హుషారుగా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. స్వల్పంగా పెరిగిన బంగారం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:12 IST)
దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 200 పాయింట్లు పెరిగి 38,510కు చేరింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుని 11,355 వద్ద ట్రేడవుతోంది. గురువారం యూఎస్‌ ఇండెక్సులు ఎస్‌అండ్‌పీ, డోజోన్స్‌ 0.3 శాతం నీరసించగా.. నాస్‌డాక్‌ అదే స్థాయిలో లాభపడింది. ఇక ఆసియాలోనూ మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. అయితే దేశీయంగా బలపడ్డ సెంటిమెంటు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు.
 
అలాగే బంగారం ధరలు రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టాయి. కానీ శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. బంగారం ధర బాటలోనే వెండి కూడా స్వల్పంగా పెరిగాయి . మరోవైపు అంతర్జాతీయ మార్కెట‌్‌లో కూడా బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 
 
డాలర్ బలపడటం, అమెరికా మరో ఉద్దీపణ ప్యాకేజీ అంచనాలు సహా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్‌లో కూడా గోల్డ్ ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. కానీ శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయినా పసిడి కొనేవారికి ఇది సానుకూల సమయమని నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments