బీరూట్‌లో ఎమెర్జెన్సీ.. లెబనాన్ పార్లమెంట్ ఆమోదం

Webdunia
శుక్రవారం, 14 ఆగస్టు 2020 (09:43 IST)
బీరూట్‌లో ఆగస్టు 4న భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ఘటనకు బాధ్యత వహిస్తూ లెబనాన్‌ క్యాబినెట్‌ రాజీనామా చేసింది.
 
అయితే అంతకుముందే ఆగస్టు 5న బీరూట్‌లో రెండువారాల పాటు ఎమర్జెన్సీని విధిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా బీరూట్‌లో ఎమర్జెన్సీ విధించడానికి లెబనాన్‌ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంపై గురువారం లెబనాన్‌ పార్లమెంటులో ఓటింగ్‌ జరిగింది. ఎమర్జెన్సీకి పార్లమెంటు ఆమోదం తెలుపడంతో సైన్యానికి అపరిమిత అధికారాలు వచ్చాయి. ప్రజాగ్రహాన్ని అణచివేయడానికే ఎమర్జెన్సీ విధించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments