Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లకు ఫుల్‌జోష్.. తొలిసారి 48 వేల మార్కును దాటిన సెన్సెక్స్

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (16:12 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు త్వరలోనే దేశీయంగా తయారైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయనే వార్తలు ముంబై స్టాక్ మార్కెట్‌లో సరికొత్త ఆశలు రేపాయి. దీంతో సెన్సెక్స్ దూకుడు ప్రదర్శించింది. 
 
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా మార్కెట్లు సోమవారం రికార్ధు స్థాయిలో ముగిశాయి. 
 
ఈ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కారణంగా సెన్సెక్స్ తొలిసారి 48 వేల మార్కును అధిగమించింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 308 పాయింట్లు పెరిగి 48,177కి చేరుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 14,132కి ఎగబాకింది.
 
సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అత్యధికంగా లాభపడిన కంపెనీల షేర్లలో ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్చీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ వంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ తదితర కంపెనీల షేర్లు లాభాలను చవిచూశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

తమిళ డి ఎన్ ఏ చిత్రం తెలుగులో మై బేబి గా రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

తర్వాతి కథనం
Show comments