Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లకు ఫుల్‌జోష్.. తొలిసారి 48 వేల మార్కును దాటిన సెన్సెక్స్

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (16:12 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు త్వరలోనే దేశీయంగా తయారైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయనే వార్తలు ముంబై స్టాక్ మార్కెట్‌లో సరికొత్త ఆశలు రేపాయి. దీంతో సెన్సెక్స్ దూకుడు ప్రదర్శించింది. 
 
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా మార్కెట్లు సోమవారం రికార్ధు స్థాయిలో ముగిశాయి. 
 
ఈ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కారణంగా సెన్సెక్స్ తొలిసారి 48 వేల మార్కును అధిగమించింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 308 పాయింట్లు పెరిగి 48,177కి చేరుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 14,132కి ఎగబాకింది.
 
సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అత్యధికంగా లాభపడిన కంపెనీల షేర్లలో ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్చీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ వంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ తదితర కంపెనీల షేర్లు లాభాలను చవిచూశాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments