Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లకు ఫుల్‌జోష్.. తొలిసారి 48 వేల మార్కును దాటిన సెన్సెక్స్

Webdunia
సోమవారం, 4 జనవరి 2021 (16:12 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు త్వరలోనే దేశీయంగా తయారైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయనే వార్తలు ముంబై స్టాక్ మార్కెట్‌లో సరికొత్త ఆశలు రేపాయి. దీంతో సెన్సెక్స్ దూకుడు ప్రదర్శించింది. 
 
కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే అంచనాలతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా మార్కెట్లు సోమవారం రికార్ధు స్థాయిలో ముగిశాయి. 
 
ఈ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ కారణంగా సెన్సెక్స్ తొలిసారి 48 వేల మార్కును అధిగమించింది. సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 308 పాయింట్లు పెరిగి 48,177కి చేరుకుంది. నిఫ్టీ 114 పాయింట్లు లాభపడి 14,132కి ఎగబాకింది.
 
సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి అత్యధికంగా లాభపడిన కంపెనీల షేర్లలో ఓఎన్జీసీ, టీసీఎస్, హెచ్చీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్పోసిస్ వంటి కంపెనీలు ఉన్నాయి. అలాగే, కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఏసియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్ కంపెనీ తదితర కంపెనీల షేర్లు లాభాలను చవిచూశాయి. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments