Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి.. కాలాష్టమి.. రెండూ ఒకేసారి.. ఏం చేయాలి..

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (22:37 IST)
సంక్రాంతి... కాలాష్టమి అంటే అష్టమి తిథి ఒకేసారి రావడం విశేషం. అందుకే జనవరి 15వ తేదీన సూర్యునితో పాటు కాలభైరవ పూజ చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
 
ఉదయం పూట సూర్య భగవానుడిని.. సాయంత్రం పూట కాలభైరవ పూజను చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. ఇంకా సంక్రాంతి రోజున వచ్చే అష్టమి రోజున సూర్య, భైరవులకు వ్రతం ఆచరించవచ్చు. 
 
సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి.. నేతితో దీపం వెలిగించాలి.  పాలు నైవేద్యంగా సమర్పించాలి. కాలభైరవ అష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని పఠించాలి. 
 
సాయంత్రం పూట కాలభైరవ ఆలయాన్ని సందర్శించి.. నేతితో దీపం వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. మాంసాహారం తీసుకోకుండా సాత్త్విక ఆహారం తీసుకోవాలి. వీలైతే కాలభైరవునికి అభిషేకానికి పాలు ఇవ్వడం చేయొచ్చు. మిరియాలతో దీపం వెలిగించవచ్చు. 
 
భైరవుడిని ఆరాధించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. ఆందోళనలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి జాతకంలో శని, రాహువు, కేతు దోషాలుంటే తొలగిపోతాయి. సరైన శుభ ముహూర్తంతో భగవంతుడిని పూజించడం వల్ల దురదృష్టకరమైన ప్రభావాలు కూడా తొలగిపోతాయి. 
 
ఈ పూజ ఒక వ్యక్తి క్రమంగా ప్రశాంతత, శాంతి వైపు ముందుకు సాగడానికి సహాయపడుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Himayathnagar: అపార్ట్‌మెంట్ నుంచి దూకేసిన మహిళ.. గదిలో దేవుడు, మోక్షం అంటూ నోట్స్

Upasana-తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం గవర్నర్ల బోర్డు.. సహ-ఛైర్‌పర్సన్‌గా ఉపాసన కొణిదెల

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

02-08-2025 శనివారం ఫలితాలు - ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు....

Pindi Deepam: శ్రావణ శనివారం శ్రీవారిని పూజిస్తే.. పిండి దీపం వెలిగిస్తే?

భయాన్ని పోగొట్టే భగవంతుని శ్లోకాలు

తోరాన్ని కట్టుకున్నవారు ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

01-08-2025 శుక్రవారం దినఫలితాలు - ఊహించని ఖర్చులు చికాకుపరుస్తాయి....

తర్వాతి కథనం
Show comments