Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెయ్యి స్తంభాల గుడి- త్రికూటాత్మకం.. సప్తస్వరాలు.. లయబద్ధమైన మధురమైన సంగీతం

సెల్వి
సోమవారం, 12 మే 2025 (16:55 IST)
Thousand Pillar Temple
వరంగల్ జిల్లా, హనుమకొండ వెయ్యి స్తంభాల గుడి ప్రసిద్ధి పొందింది. వేయి స్తంభాల గుడి, ప్రాచీన వైభవాన్ని, అద్భుత శిల్ప సౌందర్యాన్ని చాటుతూ ఈనాటికీ చారిత్రక దర్పాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ శిథిలావస్థకు చేరుకుంటోంది. వేయి స్తంభాల దేవాలయ సముదాయాన్ని క్రీ.శ. 1163లో కాకతీయ రాజు ఒకటవ రుద్రదేవుడు నిర్మించాడని చెప్పే శాసనం ఉంది. 
 
ఈ గుడి వేయి స్తంభాలతో నిర్మితం కావడం మాత్రమే కాదు.. ఇక్కడ మరో విశిష్టత ఉంది. ఈ స్థంబాలపై నాణాలతో కానీ ఏదైనా లోహంతో కానీ తాకించినట్లయితే సప్తస్వరాలు, లయబద్ధమైన మధురమైన సంగీతం వినిపిస్తుంది. వేయి స్తంభాల గుడి త్రికూటాత్మకంగా ఉంటుంది. ఒక కూటంలో శివుడు, ఇంకో కూటంలో విష్ణుమూర్తి, మరో కూటంలో సూర్యభగవానుడు కొలువై ఉంటారు. వేయి స్తంభాల ఆలయం మొత్తం నిర్మాణం నక్షత్రాకారంలో ఉంది. 
 
క్లిష్టమైన చెక్కబడిన స్తంభాలు ఆలయ నిర్మాణానికి మద్దతు ఇస్తుండగా, ఆకర్షణీయమైన శిల్పాలు గోడలకు అందాన్ని జోడిస్తాయి. 1000 స్తంభాల ఆలయ అందానికి మరింత అందాన్ని చేకూర్చేది దాని చుట్టూ ఉన్న బాగా నిర్వహించబడిన తోట. తోటలో వివిధ చిన్న శివలింగాలను కూడా చూడవచ్చు. 
Thousand Pillar Temple
 
తుగ్లక్ రాజవంశం దండయాత్ర సమయంలో 1000 స్తంభాల ఆలయం చాలా వరకు దెబ్బతింది. 12వ శతాబ్దంలో రుద్రదేవుడు నిర్మించిన ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. శ్రీ రుద్రేశ్వర స్వామి ఆలయం అని పిలువబడే ఇది చాళుక్యుల ఆలయాల నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయంలో శిల్ప సంపద ఇప్పటికీ సజీవంగా దర్శనమిస్తుంది. శిల్పకళల లోని పద్మాలు, ఏనుగులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.
 
ఈ వంద స్తంభాల దేవాలయంను హిందువులు ఇంద్ర నారాయణ ఆలయంగా పిలుస్తుంటారు. బోధన్ ప్రాంతాన్ని 915 నుంచి 927 మధ్య కాలంలో పరిపాలించిన రాష్ట్రకూట చక్రవర్తి అయిన మూడో ఇంద్ర వల్లభుడు తన పేరిట ఈ ఇంద్ర నారాయణ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఆ తరువాత కాలంలో గరుడ ధ్వజ ప్రతిష్ఠాపన జరిపినట్లు చరిత్ర చెబుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments