Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో 7 గంటల్లో శ్రీవారి దర్శనం.. తిరుపతిలో చిరుజల్లులు

Webdunia
మంగళవారం, 17 మే 2016 (12:19 IST)
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఐదురోజులుగా ఉన్న రద్దీతో పోలిస్తే ప్రస్తుతం కొద్దిగా తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి ప్రస్తుతం వేచి ఉన్నారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 7 గంటల సమయం పడుతోంది. 
 
కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి మూడు గంటలకుపైగా సమయం పడుతోంది. గదులు కూడా ఖాళీగానే దొరుకుతున్నాయి. కళ్యాణకట్టకు భక్తులు చేరుకుని సులువుగానే తలనీలాలు సమర్పించుకుంటున్నారు. సోమవారం శ్రీవారిని 83,001 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.71 కోట్లు వసూలైంది.
 
తిరుపతిలో చిరుజల్లుల వర్షం 
తిరుపతిలో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. వేసవితో ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించినట్టయింది. సోమవారం నిన్న సాయంత్రం నుంచి కూడా చల్లటి వాతావరణం పట్టణంలో కనిపించింది. అయితే మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి చిరుజల్లుల వర్షం నిరంతరాయంగా పడుతూనే ఉంది. వాతావరణం పూర్తిగా చల్లగా ఉండటంతో స్థానికులతో పాటు పుణ్యక్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తులు వూపిరి పీల్చుకుంటున్నారు. ప్రతియేటా గంగజాతర సమయంలో వర్షం పడుతుంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా వర్షం పడుతోందని పట్టణ వాసులు అనుకుంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

లేటెస్ట్

Jagannath Rath Yatra: జగన్నాథ రథయాత్రలో అపశృతి.. భక్తుల వైపు దూసుకొచ్చిన ఏనుగు (video)

27-06-2025 శుక్రవారం దినఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

పూరీ జగన్నాథుడు అద్భుత విశేషాలు, ఆలయం పైన విమానం ఎగిరితే?

టీటీడీ ప్రాణదాత ట్రస్టుకు గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కోటి రూపాయల విరాళం

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

తర్వాతి కథనం
Show comments