Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూర్ణాహుతితో ముగిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (20:05 IST)
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి పవిత్రోత్సవాలు వేడుకగా జరిగాయి. మూడు రోజుల పాటు సాగిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. కంకణ బట్టర్ గిరిధర్ ఆచార్యులు ఈ ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కంకణదారులైన ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మూడు రోజుల పాటు గ్రామ పొలిమేర దాటకుండా నిష్టగా ఈ వేడుకల్లో సతీసమేతంగా పాల్గొన్నారు.
 
ఏడాది పొడ‌వునా స్వామివారి ఉత్స‌వాలు, సేవ‌ల్లో జ‌రిగిన చిన్నపాటి దోషాలను నివారించి సంపూర్ణ ఫలాన్ని మాన‌వాళికి అందించేందుకు చేపట్టిన  పవిత్రోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప‌విత్రోత్స‌వాలు నిర్వ‌హించిన అర్చ‌క బృందానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 
ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంత‌రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, కుంభ సమారోపన, పవిత్ర విసర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments