శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు... 17న స్వర్ణ రథోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 10వ తేదీ నుంచి శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 17వ తేదీన శ్రీవారికి స్వర్ణరథోత్సవం జరుగనుంది.

Webdunia
శుక్రవారం, 5 అక్టోబరు 2018 (11:08 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం ఈనెల 10వ తేదీ నుంచి శ్రీవారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 17వ తేదీన శ్రీవారికి స్వర్ణరథోత్సవం జరుగనుంది. ఈ బ్రహ్మోత్సవాలకు ఈనెల 9వ తేదీన అంకురార్పణ చేస్తారు.
 
చాంద్రమానం ప్రకారం మూడేళ్లకోసారి అధికమాసం వస్తుంది. ఆ సంవత్సరం భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, దసరా సమయంలో నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. వీటిని పదో తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్వహిస్తారు. 
 
రెండోసారి జరిగే నవరాత్రి ఉత్సవాల్లో ధ్వజారోహణం, సీఎం పట్టువస్త్రాల సమర్పణ, స్నపన తిరుమంజనం, మహారథోత్సవం, ధ్వజావరోహణం ఉండవు. ఈ ఉత్సవాల్లో మాత్రమే నిర్వహించే పుష్పక విమాన వాహనసేవను ఈనెల 15న నిర్వహిస్తారు. 14న గరుడసేవ, 17న స్వర్ణ రథోత్సవం, 18న ఉదయం 6 గంటలకు చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిని కాదు.. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్‌ను మాత్రమే : జేడీ వాన్స్

తాజ్ మహల్‌ను సందర్శించిన రూబియో.. ఫైర్ అయిన ఇరాన్

రైతులకు రుణమాఫీ.. రోజుకు ఐదు సినిమా షోలు.. సీఎం విజయ్

నిప్పుల కుంపటిగా ఆంధ్రప్రదేశ్ - భానుడి ప్రతాపానికి తల్లడిల్లిపోతున్న జనం

పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. పార్టీ కార్యవర్గం రద్దు

అన్నీ చూడండి

లేటెస్ట్

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

తర్వాతి కథనం
Show comments