డాలర్ల కేసు పునర్విచారణ : తితిదేలో కలకలం

Webdunia
బుధవారం, 27 నవంబరు 2019 (16:27 IST)
తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గతంలో కుదిపివేసిన 300 బంగారు డాలర్ల దుర్వినియోగం కేసును మరోసారి విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి తితిదే డాలర్ల కేసును విచారణ నిమిత్తం విశ్రాంత ఐపీఎస్‌ అధికారి సత్యనారాయణను నియమిస్తూ జీఓ కూడా జారీచేశారు. మూడునెలల్లో విచారించి నివేదిక అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 
అసలు కథ ఇదీ.. : 
తిరుమలకు వచ్చే భక్తులకు తితిదే ఆధ్వర్యంలో బంగారు, వెండి, ఇతర లోహాలతో శ్రీవారు, లక్ష్మీదేవీతో కూడిన డాలర్లను విక్రయిస్తుంటారు. దీనికి సంబంధించిన కౌంటర్‌ను 2006లో అసిస్టెంట్‌ షరాబు కె.వెంకటాచలపతి నిర్వహించేవారు. ఐదు గ్రాముల బరువైన 300 బంగారు డాలర్లు ఆ సమయంలో దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీనిపై అప్పట్లోనే ప్రభుత్వం విచారణ కమిటీని నియమించింది. 
 
ప్రధాన నిందితుడిగా ఉన్న కౌంటర్‌ నిర్వాహకుడైన వెంకటాచలపతిని తితిదే 2006లో సస్పెండ్‌ చేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న ఓ మహిళా ఉద్యోగిని చనిపోయారు. ప్రస్తుత ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి, విశ్రాంత స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ ఈఓలు ప్రభాకర్‌ రెడ్డి, వాసుదేవ్‌‌లు కూడా విచారణ ఎదుర్కున్నారు. విచారణ కమిటి వీరికి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. మిగిలిన వారిలో కొందరు ఉద్యోగులు పదవి విరమణ చేయగా, కొందరు ఇంకా విధుల్లో కొనసాగుతున్నారు. 
 
ఆ తర్వాత ఈ కేసులో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. తాజాగా అసిస్టెంట్‌ షరాబుతో పాటు 17 మందిపై విచారించాలంటూ కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. పుష్కరకాలం నాటి కేసును తిరిగి తోడాలని ప్రభుత్వం భావించడం దేవస్థానం వర్గాల్లో కలకలం రేపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debits: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

గ్రీన్‌ఫీల్డ్ అమరావతి.. రైతు సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తాం.. మంత్రి నారాయణ

పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ఫ్రేమ్‌వర్క్.. జీవోను జారీ చేసిన తెలంగాణ సర్కారు

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

19-11-2025 బుధవారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల: క్యూలైన్లలో లక్షలాది మంది భక్తులు.. నీటి కొరత ఫిర్యాదులు.. ట్రావెన్‌కోర్ ఏమందంటే?

18-11-2025 మంగళవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం.. ఆప్తులను కలుసుకుంటారు...

తర్వాతి కథనం
Show comments