Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి లడ్డూలో వెంట్రుకలు... గతంలో ఇనుప మేకులు కూడా...

Advertiesment
శ్రీవారి లడ్డూలో వెంట్రుకలు... గతంలో ఇనుప మేకులు కూడా...
, శుక్రవారం, 15 నవంబరు 2019 (09:56 IST)
పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. పరమ పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూలో వెంట్రుకలు, మేకులు వచ్చాయి. వీటిని చూసిన భక్తులు నివ్వెరపోయారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన భక్తులు ఇటీవల తిరుమలకు శ్రీవారి దర్శనార్థం వెళ్ళారు. శ్రీవారి దర్శనార్థం తాము బసచేసిన గదికి వెళ్లి లడ్డూ ప్రసాదాన్ని ఆరగించేందుకు తెరిచారు. 
 
అపుడు ఆ లడ్డూలో వెంట్రుకలు, దారాలను చూసి వారు అవాక్కయ్యారు. ఈ విషయం నలుగురికీ పొక్కడంతో, భక్తులంతా తిరుమల ఆలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా లడ్డూలో మేకులు, వంటి వస్తువులు కూడా వచ్చిన విషయం తెల్సిందే. అయినప్పటికీ శ్రీవారి సిబ్బందిలో నిర్లక్ష్యం మాత్రం పోవడం లేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం (15-11-2019) రాశిఫలాలు - దంపతుల మధ్య సఖ్యత...