Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశిపై టిటిడి తీసుకున్న నిర్ణయం భేష్ - కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి

Webdunia
బుధవారం, 2 డిశెంబరు 2020 (17:15 IST)
ఈనెల 25వ తేదీ ముక్కోటి ఏకాదశి సంధర్భంగా పది రోజుల పాటు భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్సనం కల్పించడం ఆనందదాయకమన్నారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. టిటిడి చేస్తున్న కార్యక్రమాల ద్వారా భక్తులకు మేలు కలగాలని కోరుకున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీవారిని ఈరోజు మధ్యాహ్నం కంచి పీఠాదిపతి దర్సించుకున్నారు. 
 
ఆలయం వద్ద టిటిడి ఈవో కె.ఎస్.జవహర్ రెడ్డి, తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిలు స్వాగతం పలికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో అనేక వ్రత, పూజాది ఉత్సవాలను భక్తుల సంక్షేమం కోసం టిటిడి నిర్వహిస్తుండడం సంతోషించదగ్గ విషయమన్నారు. కార్తీక మాసంలో దీపోత్సవం సందర్భంగా పీఠాధిపతులను టిటిడి ఆహ్వానం మేరకు తిరుమలకు వచ్చామన్నారు. 
 
కార్తీక మాసంలో భగవద్గీత, సుందరకాండ పారాయణం, విరాటపర్వం ప్రవచనాన్ని ప్రతినిత్యం మండపంలో శివకేశవ విశేష పూజాది కార్యక్రమాలు టిటిడి నిర్వహిస్తోందన్నారు. కరోనా కాలంలో కూడా తిరుమలలో లోక కళ్యాణార్థం, భక్తుల ఆరోగ్యార్థం టిటిడి ఎటువంటి లోటు లేకుండా విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

లేటెస్ట్

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. మెగాస్టార్‌కు ఆహ్వానం

సూర్యుడు పాటించిన సంకష్టహర చతుర్థి వ్రతం.. నవగహ్రదోషాలు మటాష్

తర్వాతి కథనం
Show comments