Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానవాళి ఆరోగ్యం కోసం టిటిడి అద్భుత యాగం.. ఏంటది?

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (19:28 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం మానవాళి ఆరోగ్యం కోసం అద్భుత యాగాన్ని నిర్వహించింది. తిరుమలలోని వేదపాఠశాలలో మహాసుదర్సన సహిత విశ్వశాంతి యాగాన్ని నిర్వహించారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా విశ్వశాంతి యాగం జరిగింది.
 
టిటిడికి చెందిన వేదపండితులు, అలాగే వేదపాఠశాలలోని విద్యార్థులు విశ్వశాంతి యాగంలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన యాగం మధ్యాహ్నం వరకు సాగింది. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఒక్కసారిగా వేదపాఠశాల మారుమ్రోగింది.
 
గత కొన్నిరోజుల ముందే టిటిడి కరోనా అంతరించిపోవాలని యాగాన్ని నిర్వహించారు. ఏకధాటిగా రెండునెలల పాటు ఈ కార్యక్రమం జరిగింది. ఆలయం ముందు పండితులు స్వామివారిపై కీర్తనలను ఆలపించారు. ప్రపంచాన్ని పట్టి పీటిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలందరూ సురక్షితంగా బయటపడాలని టిటిడి అధికారులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments