Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి దర్శనానికి మార్గదర్శకాలు సిద్ధం చేసిన తితిదే - తొలి 3 రోజులు వారికే..

Webdunia
గురువారం, 14 మే 2020 (16:02 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు శ్రీవారి దర్శనాన్ని నిలిపివేశారు. ఫలితంగా గత 50 రోజులకు పైగా తిరుమల కొండపైకి భక్తులు ఒక్కరంటే ఒక్కరు కూడా వెళ్లలేదు. కేవలం తిరుమల గిరిపై నివాసిస్తున్న ఉద్యోగులు, తితిదే సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17వ తేదీన లాక్డౌన్ ఎత్తివేసిన పక్షంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతించాలని తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలను కూడా సిద్ధం చేసింది. 
 
వీటిలోభాగంగా, తొలి మూడు రోజుల పాటు కేవలం తితిదే సిబ్బందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ తర్వాత తిరుపతి, తిరుమల ప్రజలకు 15 రోజుల పాటు దర్శనం అందుబాటులోకి తెస్తారు. అదీకూడా ప్రయోగాత్మకంగా ఈ దర్శనం కల్పించనున్నారు.
 
అంతేకాకుండా, రోజుకు కేవలం 14 గంటల పాటు కేవలం 500 మందికి మాత్రమే దర్శనం కల్పిస్తారు. ఆ లెక్కన వారానికి 7 వేలు మంది మాత్రమే శ్రీవారిని దర్శనం చేసుకునే వెసులుబాటు లభించనుంది. ఇతర భక్తుల కోసం దర్శన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో తితిదే విక్రయించనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో యువకుడితో సహజీవనం చేస్తూ ప్రియుడు పట్టించుకోలేదనీ...

తల్లిబాట పథకం : గిరిజనులకు రగ్గులు పంపిన పవన్ కళ్యాణ్

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Kalki Jayanti 2025: కల్కి జయంతి.. పూజ, జపం, దానధర్మాలతో విశిష్ట ఫలితాలు

Skandha Sasti: నాగ దోషాలను దూరం చేసే స్కంధ షష్ఠి పూజ.. కల్యాణం, హోమం చేయిస్తే?

జూలై 30న స్కంధ షష్ఠి.. కుమార స్వామిని ఎర్రని పువ్వులు సమర్పిస్తే కష్టాలు మటాష్

varalakshmi vratham 2025 ఆగస్టు 8 వరలక్ష్మీ వ్రతం, ఏం చేయాలి?

29-07-2025 మంగళవారం ఫలితాలు - పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు...

తర్వాతి కథనం
Show comments