తిరుమలలో రద్దీ.. జూన్ 30వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

సెల్వి
శుక్రవారం, 24 మే 2024 (16:42 IST)
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు అధికంగా తరలివస్తున్నారు. వారు స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో సుమారు 30-40 గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తోంది. 
 
సామాన్య భక్తులకు త్వరిత గతిన స్వామివారి దర్శనం కల్పించేందుకు జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. ఎన్నికలు పూర్తి కావడం, వేసవి సెలవులు కొనసాగుతుండడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. 
 
టీటీడీ రద్దీని గమనిస్తూ.. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు అందిస్తున్నారు. ఈ మూడు రోజులు రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

లేటెస్ట్

కోటి సోమవారం అంటే ఏమిటి?

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?

తర్వాతి కథనం
Show comments